‘నాగచైతన్య డివోర్స్ 100 శాతం కేసీఆర్, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే.. ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చవద్దు అంటే..సమంతను నా దగ్గరకు పంపాలని అని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేశారు. సమంతను వెళ్లమని చెప్పి నాగార్జున వాళ్లు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్లను అనింది. వెళ్లను అని చెబితే.. వింటే విను.. లేకపోతే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు’ అని కొండా సురేఖ వ్యాఖ్యానించినట్టు నాగార్జున తన పిటిషన్లో ప్రస్తావించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.