సీబీఐ కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత సంజయ్ రాయ్‌పై లై డిటెక్టర్ పరీక్షకు నిర్వహించారు. తాను నిర్దోషి అని పరీక్షలో సంజయ్ చెప్పాడు. తాను సెమినార్ హాల్‌లోకి ప్రవేశించినప్పుడు, మహిళ అప్పటికే అపస్మారక స్థితిలో ఉందని పేర్కొన్నాడు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఎందుకు తెలియజేయలేదని అడిగినప్పుడు, గాయపడిన స్థితిలో ఉన్న మహిళను చూసి తాను భయాందోళనకు గురయ్యానని వెల్లడించాడు. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది. తనను ఇరికిస్తున్నారని సంజయ్ రాయ్ కూడా చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here