డెడ్ స్టోరేజ్ నుంచి జలకళ వరకు
24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎల్ఎండీలో ఆగస్టు చివరి వారం వరకు సగం కూడా నిండ లేదు. పది టీఎంసీలకు పైగా ఎత్తిపోసిన నీటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీ వదలడంతో జలకళ సంతరించుకుంది. అల్పపీడన ప్రభావాలతో కురిసిన వర్షాలతో ఎగువ మానేర్, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్ లు పూర్తి స్థాయిలో నిండాయి. ఎత్తిపోసిన నీళ్లు ఖరీదైనవి కావడంతో వృధా చేయకుండా అధికారులు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ లో తొలిసారి రెండు గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేర్ వాగులోకి విడుదల చేసి గంటన్నరలోపే గేట్లు మూసేశారు.