ప్రకటించింది 33 శాతం.. ఇచ్చేది 16 శాతం..
2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభం రూ.4,701 కోట్లు. నికర లాభాల్లో 33 శాతం బోనస్గా సింగరేణి ఉద్యోగులకు ఇస్తున్నట్లు యాజమాన్యం, ప్రభుత్వం ప్రకటించింది. అయితే..33 శాతం ఇస్తామని ప్రకటించి.. కేవలం 16 శాతం మాత్రమే బోనస్గా ఇస్తున్నారని.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఉద్యోగులను మోసం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పినట్టు 33 శాతం బోనస్ రూ. 1550 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.