తుది ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్
గ్రూపు-4 పరీక్ష తుది ఫలితాలు ప్రకటించాలని ఇటీవల టీజీపీఎస్సీ, గాంధీ భవన్ ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 45 రోజులు దాటుతున్నా… ఇప్పటికీ ఫైనల్ ఫలితాలు విడుదల చేయలేదని, ఉద్యోగాలు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలిరాగ… పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్ 4 పరీక్ష రాసి 460 రోజులు అవుతుందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైందని అభ్యర్థులు తెలిపారు. డీఎస్సీ పోస్టులకు 56 రోజులో పూర్తి చేసిన అధికారులు, 8 వేల గ్రూప్-4 పోస్టులకు 460 రోజులు ఎలా పడుతుందని అభ్యర్థులు ప్రశ్నించారు. వెంటనే తుది ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.