తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. కొందరు నిర్జల ఉపవాసం అంటే నీరు తీసుకోకుండా ఉంటారు. మరికొందరు కేవలం పండ్లు, గింజలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేందుకు ఇష్టపడతారు. నవరాత్రి సమయంలో ఉపవాసం చేయడం వల్ల దుర్గాదేవి తమ పాపాలన్నింటినీ శుభ్రపరుస్తుందని నమ్ముతారు. మనసు, శరీరాన్ని శుద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అసలు నవరాత్రికి మొదటిగా ఉపవాసం చేసింది ఎవరో తెలుసా? పురాణాల ప్రకారం నవరాత్రి ఉపవాసం మొదట ఆచరించింది ఇంకెవరో కాదు శ్రీరామ చంద్రుడు.