స్టేషన్ లో మృతదేహాలు లభ్యం
ఏఎస్ఐలు జీవన్ లాల్, ప్రీతమ్ దాస్ మృతదేహాలు జలంధర్ జిల్లాలోని ఆదంపూర్ రైల్వే స్టేషన్లో లభ్యమయ్యాయని జలంధర్ (గ్రామీణ) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) హర్కమల్ ప్రీత్ సింగ్ ఖాఖ్ తెలిపారు. కోర్టులో విచారణ అనంతరం కపుర్తలా కోర్టు కాంప్లెక్స్ నుంచి తిరిగి వస్తుండగా తప్పించుకున్న టీనేజ్ నిందితుడు అమన్ దీప్ సింగ్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. రెండు మృతదేహాలు లభ్యమైన విషయాన్ని అదంపూర్ స్టేషన్ మాస్టర్ నరేష్ రాజు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ‘‘ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అమన్ దీప్ ఆచూకీ లభించకపోవడంతో ఆ ఇద్దరు ఏఎస్ఐలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు’’ అని ఎస్ఎస్పీ ప్రీత్ సింగ్ తెలిపారు.