భక్తుల రద్దీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల తాకిడి మహాశక్తి ఆలయానికి పెరిగింది. సోమవారం రాత్రి బిఆర్ఎస్ కు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ కు చెందిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ అమ్మవార్ల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.