ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు హీరో నాగార్జున. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారనని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలని హీరో నాగార్జునను కోరింది. దీంతో హీరో నాగార్జున తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి మంగళవారం నాంపల్లి కోర్టుకు వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here