మంత్రి నారా లోకేశ్ ఫైర్

వరద బాధితులకు ఇస్తామన్న కోటిలో ఒక్క రూపాయి కూడా వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ ఇవ్వలేదంటూ మంత్రి లోకేశ్ విమర్శించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. వరదబాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నారన్నారు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారన్నారు. వీటికి ఖర్చు రూ.23 లక్షలు కూడా కాలేదన్నారు. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి..ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయన్నారు.తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుని ప్రజాధనం కోట్లు ఎగ్‌ పఫ్‌లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన వైఎస్ జగన్ ఇకనైనా ఫేక్ ప్రచారాలు ఆపాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here