కవ్వగుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(50) తన ఇద్దరు కుమారులు మణికంఠ(16), సాయి కుమార్ (13)తో కలిసి పోలవరం కుడికాల్వ వద్దకు వెళ్లారు. పందెం కోడిని ఈత కొట్టిస్తుండగా ముగ్గురు కాల్వలో గల్లంతయ్యారు. తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా, మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు్న్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here