కొందరు కండ్లల్లో కారం కొట్టుకుంటున్నారు
రాష్ట్రంలో 34 వేల మంది టీచర్ల బదిలీలతో పాటు 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు అందించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొన్ని కొరివి దెయ్యాలు మీకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేశాయని, మీ కుటుంబాల్లో సంతోషాన్ని చూసేందుకు అన్నింటినీ ఎదుర్కొని నియామకపత్రాలను అందజేస్తున్నామన్నారు. మీ సంతోషం చూసి కొంతమంది కండ్లల్లో కారం కొట్టుకుంటున్నారన్నారు. గత పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ .. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వాళ్లు సలహాలు ఇవ్వరు… కానీ మేం చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారన్నారు.