చెత్త పేరుతో చోరీలు ..నలుగురు మహిళలు అరెస్టు
పగటి వేళలో చెత్త ఏరుకుంటూ తాళాలు వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడే ముఠాకు చెందిన నలుగురు మహిళలను సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. చెత్త ఏరుకునే ఉడుత వైష్ణవి, లోకిని స్వప్న, లోకిని లచ్చమ్మ, కట్ల రజిత, కట్ల శ్రీనివాస్ లు పట్టపగలు తాళం వేసిన ఇళ్ళలో చొరబడి బిందెలను ఇతరత్రా సామానును దొంగలించి అమ్ముకుంటున్నారు.