పరస్పరం కేసులతో రాజకీయ దుమారం
మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ దంపతులు శ్రీలత చంద్రశేఖర్ మధ్య పొలిటికల్ వార్ అధికారుల మెడకు ఉచ్చు బిగిసేలా మారుతుంది. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ప్రముఖులు జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రచారం జరిగుతుంది. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేయర్, మంత్రి ఒకే వేదికను పంచుకోకపోవడం.. మేయర్ తరుచూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై విమర్శలు గుప్పించడం కాంగ్రెస్ వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం మున్సిపల్ సమీక్షా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే, మేయర్ కు సమాచారం కూడా ఇవ్వకపోవడంతో మేయర్ మరోమారు ఫైర్ అయ్యారు.