మరోవైపు ఈ ఏడాది ఇచ్చిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా ఇవాళ(అక్టోబర్ 09) 10,006 మంది టీచర్లకే బుధవారం నియామక ఉత్తర్వులివ్వనున్నారు. వీరంతా త్వరలోనే విధుల్లో చేరనున్నారు. వీరి పోస్టింగులకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు షురూ చేసింది. దసరా తర్వాత వీరంతా విధుల్లో చేరుతారు. ఇక ఈ నోటిఫికేషన్ లో 1056 టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్పడింది. కోర్టు కేసుల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పోస్టుల విషయంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.