వివాదాలకు, కాంట్రవర్షియల్‌ ట్వీట్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్న నటి పూనమ్‌ కౌర్‌.. తాజాగా చేసిన ట్వీట్‌ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. తనకు సినిమా ఇండస్ట్రీలో చాలా అన్యాయం జరిగిందంటూ కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా ట్వీట్స్‌ చేస్తూ ఓ దర్శకుడ్ని టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. క్లారిఫికేషన్‌ అంటూ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు పూనమ్‌. టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడు ఒక పంజాబీ నటి కెరీర్‌ మొత్తం నాశనం చేశాడని, ఆమెను గర్భవతిని చేసి చాలా అన్యాయం చేశాడని ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ జోక్యంతో ఆమెకు కొంత సహాయం అందిందని తెలిపారు. అయితే తనను, పొలిటీషియన్‌గా మారిన ఓ నటుడ్ని అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని చెబుతోంది. 

ఆ పంజాబీ నటికి అన్యాయం చేసింది రాజకీయ నాయకుడిగా మారిన నటుడు కాదని, తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక ప్రముఖ దర్శకుడని తన ట్వీట్‌లో క్లారిఫై చేసింది పూనమ్‌. తనకు అన్యాయం జరిగిందంటూ ఎంతో కాలంగా రకరకాల ట్వీట్స్‌ పెడుతూ ఓ ప్రముఖ డైరెక్టర్‌ని పూనమ్‌ టార్గెట్‌ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా వేసిన ట్వీట్‌లో మరోసారి అతనిపై విరుచుకుపడిరది. ఇప్పటికే రకరకాల వివాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో పూనమ్‌ వేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో.. పంజాబీ నటికి అన్యాయం చేసిన ఆ దర్శకుడు ఎవరో తెలియాలంటే వేచి చూడక తప్పదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here