ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆ రోజు నవమి దాకా పోరు సలిపి ఆశ్వయుజ శుక్ల నవమి దినమున ఆ రక్కసుని అంతమొందించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించింది. అందుచేతనే ఈ నవమిని మహానవమిగా భక్తులు జరుపుకుంటారని చిలకమర్తి తెలిపారు. త్రిరాత్ర వ్రతం ఈరోజుతో ముగుస్తుంది. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పరమేశ్వరిని మహిషాసురమర్ధిని అవతారంలో అనేక విధాలుగా పూజించి జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యక పర్ధని శైలసుతే…! అంటూ ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి, పులిహార, పులగాన్నం, గారెలు, నిమ్మరసం నివేదన చేసి, శాంతింపచేస్తారు.