నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏటా అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో పెడతారు. గతరాత్రి కార్యక్రమం పూర్తైన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. అయితే విగ్రహ ధ్వంసం పట్ల హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here