రాష్ట్రంలో లాసెట్ ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే రెండు విడతల్లో సీట్ల కేటాయింపు జరగా… తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. స్పాట్ అడ్మిషన్లుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 17 నుంచి స్పాట్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు, సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. ఈ మేరకు పూర్తి వివరాలను వెబ్ సైట్ లో ఉంచారు.