ప్రతి బాటిల్పై రూ.10 నుంచి రూ.25వరకు బ్రాండ్ను బట్టి అదనంగా వసూలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు పూర్తిగా మూతబడనుండటంతో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయాలపై ఆంక్షల్ని లెక్క చేయడం లేదు. ఏపీబీసీఎల్ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా చేసే బ్రాండ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. దుకాణాలకు బదులు బార్లకు సరఫరా చేయడం మేలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.