ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, తనయుడు రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. 

వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. విరాళ చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సాదర స్వాగతం పలికిన చంద్రబాబు.. భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here