కామంధులు రెచ్చిపోతున్నారు- వైసీపీ విమర్శలు
శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగిందని వైసీపీ అధికార టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో వాచ్మెన్, అతని కొడుకును నలుగురు కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై అత్యాచారం చేశారని తెలిపింది. రాష్ట్రంలో కామాంధులు హెచ్చుమీరుతున్నా కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఇదేనా ఆడబిడ్డలకి మీరు కల్పించే రక్షణ అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.