దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. సాయి బాబా రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. పది రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్ హాస్పిటల్లో చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ ప్రొఫెసర్ సాయి బాబాను అరెస్టు చేసింది. ఆయన జైలు జీవితం కూడా గడిపారు. ఇటీవల ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.