అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు రేపటి (ఆదివారం) వరకు నిర్వహిస్తారు. మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 2వ అన్నపూర్ణాలంకరణ, 3వ రోజు గాయత్రి అలంకారం, 4వ రోజు శ్రీమహాలక్ష్మి అలంకారం, 5వ రోజు రాజరాజేశ్వరి లలితాదేవి అలంకారంలో, 6వ రోజు భవానీ అలంకారంలో, 7వ రోజు సరస్వతీ అలంకారంలో, 8వ శ్రీభద్రకాళి మహాదుర్గాలంకారం, 9వ రోజు మహిషాసురమర్థినీ అలంకారణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆఖరిరోజు 13వ తేదీన నిర్వహించే భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం కనుల పండవగా సాగనుంది.