రాజ‌గోపాల్ అనే వ్యక్తి ముందుగా రెక్కీ నిర్వహించి, ఒంట‌రిగా ఉంటున్న వృద్ధులు, మ‌హిళ‌ల ఇళ్లలో కిర‌ణ్‌, ఉమామ‌హేశ్వర‌రావుతో క‌లిసి చోరీలు చేస్తున్నారు. రాజ‌గోపాల్‌, కిర‌ణ్ తండ్రీ కొడుకులు. మెళియాపుట్టికి చెందిన ఉమామ‌హేశ్వర‌రావుపై గ‌తంలోనూ కేసులున్నాయి. వీరికి ఓ మ‌హిళ కూడా సాయ‌ప‌డేది. ఈ కేసుల‌ను ఛేదించేందుకు సీఐలు డి. మోహ‌న్‌రావు, మంగ‌రాజు, ఎస్ఐ హైమ‌వ‌తి, కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. ప‌ట్టుకున్న దొంగ‌ల‌ను ఎస్పీ కేవీ మ‌హేశ్వర‌రెడ్డి, అద‌న‌పు ఎస్పీ పి.శ్రీ‌నివాస‌రావు శుక్రవారం మీడియా ముందు ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here