శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు (8 రోజులు) వరకు ముఖ్యాంశాలు
- అక్టోబరు 4న సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అక్టోబరు 5న పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ. 13.45 కోట్లతో వకుళమాతా వంటశాలను ప్రారంభించారు.
- బ్రహ్మోత్సవాల్లో 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
- 15 లక్షల మంది భక్తులు శ్రీవారి వాహన సేవలు వీక్షించారు.
- గరుడసేవనాడు 82,043 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, గరుడసేవలో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
- బ్రహ్మోత్సవాల్లో 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండగా, మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు.
- హుండీ కానుకల ద్వారా రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది.
- తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.60 లక్షలు
కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన నాడు -నేడు కాన్సెప్ట్తో ఫొటో ఎగ్జిబిషన్, అటవీ, శిల్ప కళాశాలలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. తిరుమలలోని పలు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లతోపాటు, 32 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు మాడ వీధులలో 23, ప్రధాన కూడళ్లలో 9, ప్రత్యేకంగా తిరుపతిలో 7 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.