ఐదుగురు సభ్యులతో కమిటీ
రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం పీపీపీ పాలసీని సిద్ధం చేయడానికి, ప్రణాళికను ఖరారు చేయడానికి ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కన్వీనర్గా చీఫ్ ఇంజినీర్ (ఆర్అండ్బీ) ఎస్హెచ్, ఎండీ, ఏపీఆర్డీసీ, సభ్యులుగా ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఆర్అండ్బీ) ఎండీఆర్ఎస్, అడ్మినిస్ట్రేషన్, చీఫ్ ఇంజినీర్ (ఆర్అండ్బీ) ఎన్హెచ్ & సీఆర్ఎఫ్, డిప్యూటీ ఆర్థిక సలహాదారు సురేంద్ర దత్తి, పీపీపీ నిపుణుడు షాలెం రాజు ఉన్నారు. అయితే పాలసీ ఖరారు చేసి కమిటీ నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా చీఫ్ ఇంజినీర్ (ఆర్అండ్బీ) ఎస్హెచ్ & ఎండీ, ఏపీఆర్డీసీ, అండ్ కమిటీ కన్వీనర్కు నిర్దేంచారు.