ఈ ఘటనలో బాబా సిద్దిఖీ సహచరుడికి కూడా గాయాలయ్యాయని సమాచారం.

బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధిఖీ ఈ ఏడాది మార్చ్​లో కాంగ్రెస్​ని వీడి ఎన్​సీపీలో చేరారు. సిద్ధిఖీ 2000 ప్రారంభంలో కాంగ్రెస్-అవిభాజ్య ఎన్​సీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

ఈ దాడి అత్యంత దురదృష్టకరమని, ఖండించదగినదని ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ అభివర్ణించారు. మైనార్టీలు, లౌకికవాదం కోసం పోరాడిన నాయకుడిని కోల్పోయామని ఎన్​సీపీ నేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here