మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై బాంద్రాలోని ఆయన కుమారుడు జీషాన్ కార్యాలయంలో శనివారం రాత్రి ముగ్గురు దుండగులు బాబా సిద్దిఖీని కాల్చి చంపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్​లు చొచ్చుకెళ్లాయి. తీవ్ర గాయాలతో ఉన్న బాబా సిద్దిఖీని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించరు. ఆయన వయస్సు 66. ఈ బాబా సిద్ధిఖీ ఒక రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు బాలీవుడ్​లో ‘మధ్యవర్తిగా’ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా సల్మాన్​ ఖాన్​, షారుఖ్​ ఖాన్​ల మధ్య నెలకొన్న ‘కోల్డ్​ వార్​’ని బాబా సిద్ధిఖీ అంతం చేసిన విధానం గురించి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here