శంకుస్థానలు, పూజలు పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులతో కొన్ని గంటల పాటు గడిపారు. సాయంత్రం నివాసం నుంచి గ్రామ శివారులోని జమ్మి చెట్టు వద్దకు ర్యాలీగా వెళ్ళారు.అనంతరం మనవడితో కలిసి జమ్మి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన సొంత గ్రామస్తులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్వగ్రామానికి రావటంతో కొండారెడ్డిపల్లిలో సందడి నెలకొనట్లు అయింది.