డీజే, సౌండ్ మిక్సర్, హైసౌండ్ ఎక్విప్మెంట్ పై నిషేధం విధించారు. నగరంలోని నాలుగు జోన్లలో సౌండ్ సిస్టమ్లు పెట్టడానికి డెసిబుల్స్ను నిర్దేశించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుది. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో వీటిని అనుమతిస్తారు. జనావాసాల్లో ఉదయం 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్ సౌండ్స్ మించకూదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కోర్టు ప్రాంగణాలకు వంద మీటర్ల దూరంలో డీజేలపై విధించారు. అలాగే మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా కాల్చడంపై పూర్తిగా నిషేధిస్తున్నామని సీపీ చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.