వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో రాగల 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్,నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర, ఉత్తర బంగాళాఖాతంలో తదుపరి 2 రోజులలో నైరుతి రుతుపవనాలు క్రమంగా వైదొలుగుతున్నాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.
Home Andhra Pradesh అల్పపీడనం ఎఫెక్ట్, రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్-ap rains update...