ఎంతమందిని ఎంపిక చేస్తారు?
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీ అభ్యర్థులు 3,050, ఎస్టీ అభ్యర్థులు 2,000 మంది ఉంటారు. ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్ వెయిటేజ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్కు 85 శాతం, టెట్ స్కోర్కు 15 శాతం వెయిటేజ్ ఉంటుంది. అభ్యర్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని.. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు.