ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకు

మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ, షాపుల కేటాయింపు అంతా సజావుగా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 16వ తేదీ నుంచి అమలయ్యే నూతన మద్యం పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరుగుతాయన్నారు. కొత్త బ్రాండ్ల టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటామన్నారు. మద్యం షాపుల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎవరినీ వదిలేది లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహించినా, మద్యం విక్రయించినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాలు, పాఠశాలలకు 100 మీటర్లలోపు మద్యం షాపులు ఉండకూడదన్నారు. ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువకు అమ్మకాలు, బెల్టు, కల్తీ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలుంటాయన్నారు. వైన్ షాపుల్లో సిండికేట్ జరిగినట్లు ఎలాంటి ఎవరూ ఫిర్యాదు అందలేదన్నారు. ఎక్కడైనా అలాంటి ఘటనలు జరిగినట్లు తెలిస్తే చర్యలుంటాయన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో మహిళలు, ఉద్యోగులు, యువత దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here