కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి ఆసుపత్రి పాలు కావటంతో జనసేన పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా నేత కిషోర్ ఆమెను పరామర్శించారు. అనంతరం మాట్లాడిన కిషోర్.. జానీ మాస్టర్ అలాంటి పని చేసే వ్యక్తి కాదన్నారు. కావాలనే జానీ మాస్టర్ ని ఇలాంటి కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబం ఎంతో వేదనకు గురి అవుతుందని త్వరితగతిన కేసును తేల్చాలని కిషోర్ అన్నారు.