బాబా సిద్ధిఖీని ముంబైలోని ఆయన కార్యాలయం వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ (19)లను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. మరో నిందితుడు, కుట్రదారుడు ప్రవీణ్ లోంకర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ప్రవీణ్ లోంకర్ సోదరుడు శుభమ్‌కు జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శుభమ్ ఐడీ నుంచి లారెన్స్ బిష్ణోయ్ తరఫున ప్రవీణ్ ఈ హత్యకు బాధ్యత వహించినట్లు ఫేస్‌బుక్‌లో ప్రకటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here