అభ్యర్థులను ప్రకటించాల్సిన ఇతర టీచర్ యూనియన్లు

నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 జిల్లాల్లో విస్తరించి ఉన్న టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు పీఆర్టీయూ సైతం అన్ని రకాలుగా శక్తులను ఒడ్డుతుంది. కానీ, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన గలాట, టీచర్ లీడర్లు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడం వంటి సంఘటనలు పీఆర్టీయూలో ఉన్న అభిప్రాయ భేదాలను, నాయకుల మధ్య ఉన్న టికెట్ పోటీని తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో యూనియన్ అధికారికంగా ఒక అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆశావహుల్లో కనీసం ఒకరిద్దరు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసే వీలుంది. గత ఎన్నికల్లో అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ రెండోసారి పోటీ చేస్తే యూనియన్ చెందిన వరంగల్ జిల్లా నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి రెబల్ పోటీ చేయడంతో పూల రవీందర్ ఓడిపోయారు. దీంతో పీఆర్టీయూ చేతి నుంచి ఎమ్మెల్సీ స్థానం యూటీఎఫ్ చేతిలోకి వెళ్ళింది. ఈ సారి కూడా పీఆర్టీయూ నుంచి పూల రవీందర్, శ్రీపాల్ రెడ్డి, సుంకరి బిక్షం గౌడ్ వంటి నాయకులు టికెట్ రేసులో ఉన్నారని చెబుతున్నారు. మరో వైపు టీపీఆర్టీయూ, టీపీయూఎస్, టీపీఆర్టీయూ వంటి సంఘాలు సైతం పోటీ చేసే యోచనలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here