విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కదిరి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భార్య సీమంతం కార్యక్రమంలో బంధువులు, కుటుంబ సభ్యులు సందడిగా గడిపిన ఆ ఇంట విషాదం అలుముకుంది. భాస్కర్ మరణ వార్త తెలుసుకున్న భార్య లక్ష్మి, తల్లిదండ్రులు, గుండెలు పగిలేలా రోదించారు. మమ్మల్ని బస్సు ఎక్కించి, బైకులో వస్తానంటూ పాడెక్కావా భాస్కరా అంటూ తల్లిదండ్రుల రోధనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న కదిరి రూరల్ పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోహన్ తెలిపారు.
Home Andhra Pradesh శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం, భార్య సీమంతం జరిగిన మరుసటి రోజే భర్త మృతి-sri sathya sai...