ప్రయాణికుల లగేజ్ చెకింగ్
2024 అక్టోబర్ 15న ఢిల్లీ నుంచి షికాగోకు బయలుదేరిన ఏఐ127 విమానంలో బాంబు ఉందన్న సమాచారం వచ్చిందని, దాంతో ముందుజాగ్రత్త చర్యగా కెనడాలోని ఇక్యులూయిట్ విమానాశ్రయంలో ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిందని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత భద్రతా ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని, ప్రయాణికులను, ప్రయాణికుల లగేజీని తిరిగి క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. ‘‘ప్రయాణీకులకు వారి ప్రయాణం తిరిగి ప్రారంభమయ్యేంత వరకు సహాయం చేయడానికి ఎయిర్ ఇండియా (airindia) విమానాశ్రయంలో ఏజెన్సీలను యాక్టివేట్ చేసింది’’ అని ఎయిర్లైన్స్ తెలిపింది. భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం ప్రయాణికులందరినీ విమానయాన సంస్థలు తిరిగి స్క్రీనింగ్ చేస్తున్నాయని ఎయిరిండియా తెలిపింది.