జగిత్యాల జిల్లాలో 63 మద్యం షాపులు ఉండగా 41 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం, సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం షాప్ లు ఉండగా 34 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈసారి ఎక్సైజ్ అధికారులు దసరా పండుగ సందర్భంగా 20 రోజుల ముందుగానే దసరా పండుగ లక్ష్యాన్ని విధించి పూర్తి చేయాలని ఆదేశించారు. లక్ష్యాన్ని పండుగకు రెండు రోజుల ముందే పూర్తి చేశారు. జనాభా ప్రాతిపదికన మద్యం షాప్ లు ఏర్పాటు చేసి ఎక్కువ వ్యాపారం చేశారు. మద్యం షాప్ ల ద్వారా కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న 54 బార్ల ద్వారా మరో రూ.6 కోట్ల వ్యాపారం సాగింది.