రీసెంట్ గా  సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడి(muthyalamma temple)పై ఒక దుండగుడు దాడి చేసి అమ్మవారి విగ్రహాన్నికాలితో తన్నిన విషయం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.హిందువులు అయితే ఈ సంఘటనతో చాలా కోపంగా ఉండటంతో పాటుగా నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణా కి చెందిన కొంత మంది హిందూ భక్తులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ఇటీవల చెప్పినట్టుగా సనాతన ధర్మానికి సంబంధించిన బోర్డుని ఒకదాన్ని ఏర్పాటు చెయ్యాలని,ఆలయాల ఆదాయం, సంరక్షణ మొత్తం ఆ బోర్డుకే అప్పచెప్పాలని, మా ధర్మాన్ని మేము కాపాడుకుంటామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ముత్యాలమ్మ గుడిని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు సందర్శించి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యల్ని తీసుకోవాలని ప్రభుత్వాన్నికోరుతున్నారు.విగ్రహం మీద దాడి జరిపిన వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here