ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా జీవీఎంసీ 88వ వార్డు న‌ర‌వ ప‌రిధిలోని మ‌న్నెపాలెంలో మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగింది. మ‌న్నెపాలెంలో ఎంగ‌లి దేవుడు (60), భార్య దేవి, కుమారులు గోపీ, అచ్యుత‌రావు క‌లిసి నివాసిస్తున్నారు. దేవుడు తోట ప‌నులు చేసేందుకు తెలంగాణ ప్రాంతానికి వెళ్లి వ‌స్తుంటారు. భార్య స్థానికంగానే కూలీ ప‌నులు చేస్తుంటారు. చిన్న కుమారుడు గోపీ (25) త‌న‌కు న‌చ్చితే బిల్లింగ్ సెంట్రింగ్ ప‌నులు చేస్తుంటాడు. అది కూడా స‌వ్యంగా చేయ‌డు. ఒక రోజు వెళ్తే నాలుగు రోజులు ప‌ని మానేస్తాడు. పెద్ద కుమారుడు అచ్యుత‌రావు ప్రైవేటుగా భూముల స‌ర్వేలు చేస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here