ప్యాకేజీలివే….

  • ఐదు రోజుల ప్యాకేజీలో విజయవాడ, మేల్మరువాటూరు, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడలను కవర్ చేస్తుంది. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర రూ.6,600 (సూపర్ లగ్జరీ), రూ. 6,600 (అల్ట్రా డీలక్స్), రూ.8,500 (ఇంద్ర) ఉంటుంది.
  • ఆరు రోజుల ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరిగి ప్ర‌యాణంలో తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, అన్నవరం ఆలయాలలో దర్శనం లభిస్తుంది. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర రూ. 7,000 (సూపర్ లగ్జరీ), రూ. 7,000 (అల్ట్రా డీలక్స్), రూ. 9,000 (ఇంద్ర) ఉంటుంది.
  • ఏడు రోజుల ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరిగి ప్ర‌యాణంలో మదురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరంలలో దర్శనం చేసుకోవచ్చు. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర రూ. 7,600 (సూపర్ లగ్జరీ), రూ.7,600 (అల్ట్రా డీలక్స్), రూ.10,000 (ఇంద్ర)గా నిర్ణయించబడింది.
  • వివరాలకు మొబైల్ నంబర్లు: 9052227083, విశాఖపట్నం డిపో మేనేజర్ 9959225594, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, ద్వారకా బస్ స్టేషన్, వైజాగ్ 9100109731, కోఆర్డినేటర్ పీవీఎన్‌ రావు 7382914219ల‌ను సంప్ర‌దించాలి.

అయ్యప్ప భక్తులకు సేవలందించడంలో అనుభవం ఉన్న, రూట్ తెలిసిన నిష్ణాతులైన డ్రైవర్లు బస్సులను నడుపుతారు. విశాఖపట్నం ప్రాంతం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని నౌరంగ్‌పూర్, కోరాపుట్, జైపూర్ నుంచి కూడా భక్తులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించినట్లు విశాఖ‌ప‌ట్నం ప్ర‌జా ర‌వాణా అధికారి అప్ప‌ల‌రాజు తెలిపారు. 2003 నుండి ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్ ద్వారా నిర్వహించబడుతున్న శబరిమల ప్రత్యేక బస్సులు చాలా మంచి ఆదరణ పొందుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here