దాంపత్యమే సరిగ్గా లేదు
చూశారా నేను తప్పులు చేశాను అంటున్నారు. అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదు. నేను అసలు తప్పే చేయను అని ఎప్పటికీ నమ్మరు. ఆ నమ్మకమే లేని మనిషితో నేను ఎలా కాపురం చేస్తాను అని కావ్య బాధపడుతుంది. ఇంతలో పంతులు ఎంట్రీ ఇస్తాడు. అమ్మా దాంపత్య వ్రతానికి ఇంకా ఏర్పాట్లు చేయలేదా. త్వరగా మొదలుపెట్టాలి. ఎవరు కూర్చుంటారో చెప్పండి అని పంతులు అంటాడు. కావ్య, అప్పు, స్వప్న ముగ్గురు అల్లుళ్లతో కూర్చుంటారు అని కనకం అంటుంది.