174 మంది ప్రయాణికులు
2024 అక్టోబర్ 16న ఢిల్లీ నుంచి బెంగళూరుకు ముగ్గురు చిన్నారులు, ఏడుగురు సిబ్బంది సహా 174 మంది ప్రయాణికులతో ఆకాశ ఎయిర్ లైన్స్ క్యూపీ 1335 విమానం బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని బెంగళూరు వైపు వెళ్తున్న సమయంలో.. పైలట్ కు భద్రతా హెచ్చరికలు అందాయి. ఆకాశ ఎయిర్ విమానం క్యూపీ 1335కు ఆకాశ ఎయిర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని, తగిన జాగ్రత్తలతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించాలని పైలట్ కు సూచించారు. విమానంలో బాంబు ఉందన్న సమాచారం వచ్చిందని, వెంటనే విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ కోసం ఢిల్లీ విమానాశ్రయానికిక తీసుకురావాలని పైలట్ కు సూచించారు. దాంతో, విమానం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలో సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.