విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి ఆళ్లగడ్డ ఎంఎల్ఏ భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విజయ డెయిరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెయిరీలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడం, చైర్మన్ ఛాంబర్లో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.