అంతా స్థానికులే..
అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారంతా హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్కు చెందినవారిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు ఎ.కావడి నాగేంద్ర (38)పై ఆంధ్రా, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో 37 కేసులు ఉన్నాయి. ఇతని బంధువు, అంతర్రాష్ట్ర నేరస్థుడు దుర్గా వద్ద పనిచేస్తూ దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. మరో ప్రధాన నిందితుడు ప్రవీణ్పై లేపాక్షి పోలీస్స్టేషన్లో హత్య కేసు ఉంది. మూడో నిందితుడు చావలి శ్రీనివాసులు దారిదోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. వీరు టైల్స్ పరిశ్రమల్లో పనిచేస్తున్న ముగ్గురు మైనర్లను తమతో కలుపుకునని దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు.