శ్రీ‌కాకుళం జిల్లా సంత‌బొమ్మాళి మండ‌లం, మ‌లాగం పంచాయ‌తీ కుముంద‌వానిపేట గ్రామంలో మంగ‌ళ‌వారం పెను విషాదం చోటు చేసుకుంది. త‌ల్లి త‌న ఇద్దరు కుమారుల‌కు శీత‌ల పానీయాల్లో ఎలుక‌ల మందు క‌లిపి తాగించి, తాను ఆత్మహ‌త్యయ‌త్నం చేసింది. కుముంద‌వాని పేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు ప‌న్నెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి రుషి (9), బాలాజీ (8), అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోట‌ల్‌లో ప‌ని చేస్తున్నాడు. భార్యాభ‌ర్తల మ‌ధ్య మ‌న‌స్పర్థల కార‌ణంగా త‌రచూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. భ‌ర్త దూరంగా ఉండ‌టంతో జీవితం వీద విర‌క్తి చెంది అఘాయిత్యానికి పాల్పడింది దుర్గ. మంగ‌ళ‌వారం గ్రామంలో ద‌స‌రా వారాలు కావ‌డంతో త‌న ఇంటికి భోజ‌నాల‌ల‌కు రావాల‌ని దుర్గను త‌మ్ముడు హ‌రి త‌న ఇంటికి పిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here