ప్రస్తుతం ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఈ-ఫైలింగ్, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్(ఐఈసీ) 2.0 వ్యవస్థను అనుసంధానం చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ సర్క్యులర్లో పేర్కొంది. ఐఈసీ 3.0ను కొత్త ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. హైస్పీడ్ ఐటీ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఐటీ శాఖ. ఐటీఆర్ల వెరిఫికేషన్, ప్రాసెసింగ్, జారీ ప్రక్రియను వేగవంతం చేయనుంది.