ఇండిగో, ఎయిరిండియా విమానాల్లో..

రెండు ఇండిగో, ఒక ఎయిరిండియా విమానాల్లో బాంబులు పెట్టినట్లు సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి మూడు సందేశాలను పోస్ట్ చేసినట్లు పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. చత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాకు చెందిన యువకుడిని, అతని పొరుగింటి వ్యక్తి (34)ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ విచారణ నిమిత్తం ముంబైకి తీసుకొచ్చారు. రాజ్ నంద్ గావ్ జిల్లాలో 33 ఏళ్ల యువకుడు దుకాణం నిర్వహిస్తుండగా, 17 ఏళ్ల యువకుడు కాలేజీ స్టూడెంట్. ఆ మైనర్ ను విచారించగా పక్కింటి 33 ఏళ్ల యువకుడు, తను గతంలో ఒకరికొకరు ఆర్థిక సహాయం చేసుకునేవారని, ఆ లావాదేవీలపై వివాదాలు ఉన్నాయని వెల్లడైంది. పక్కింటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించేందుకు ఆ యువకుడి పేరు మీద ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here